తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత కార్యాలయ సముదాయానికి ప్రారంభోత్సవం చేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో సీఎం కేసీఆర్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కార్యాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ ను కుర్చీలో కూర్చోబెట్టి, పుష్పగుచ్ఛాన్ని అందించి సీఎం శుభాకాంక్షలు తెలిపారు.
ఆ తర్వాత కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారి, రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తాత మధు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE