తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే జనవరి 11, 12వ తేదీల్లో ఇన్చార్జి హోదాలో తొలిసారిగా తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా తెలంగాణ సీనియర్ నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్లతో ఆయన సమావేశం అయ్యారు. ఈ క్రమంలో మాణిక్రావ్ ఠాక్రే నేడు మరోసారి తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. నేడు నుంచి (జనవరి 10, శుక్రవారం) మూడు రోజుల పాటుగా పార్టీ నేతలతో పలు అంశాలపై చర్చించనున్నారు.
ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు రాష్ట్రంలో రెండు నెలల పాటుగా చేపట్టే “హాత్ సే హాత్ జోడో అభియాన్” పాదయాత్ర ప్రణాళికను ఖరారు చేయనున్నారు. హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్రపై టీపీసీసీ ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ కమిటీతో సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ మేరకు మాణిక్రావ్ ఠాక్రే మూడు రోజుల పర్యటన షెడ్యూల్ ను ఇప్పటికే విడుదల చేశారు.
జనవరి 20, శుక్రవారం షెడ్యూల్:
- 01.40 గంటలు : ఢిల్లీ నుండి హైదరాబాద్ కు ప్రయాణం ప్రారంభం
- 03.50: రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ కు చేరిక
- 04.30: గాంధీ భవన్ కు చేరిక
- 05.00-06.00: – ప్రచార కమిటీ ఛైర్మన్ అండ్ కన్వీనర్ తో సమావేశం
- 06.00-07.00: ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ తో సమావేశం
- 07.00-08.00: ఏఐసీసీ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ ఛైర్మన్ తో సమావేశం
- 08.00-09.00: పీసీసీ అధ్యక్ష, ఏఐసీసీ కార్యదర్శులతో సమావేశం
- శుక్రవారం రాత్రికి హైదరాబాద్లో బస
జనవరి 21, శనివారం షెడ్యూల్:
- 11.30-02.00: టీపీసీసీ ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం (ఎజెండా: హాత్ సే హాత్ జోడో కార్యక్రమం)
- 02.00-03.00: రిజర్వ్
- 03.00-04.00: మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు, ఇంచార్జ్, ఎగ్జిక్యూటివ్ కమిటీతో సమావేశం
- 04.00-05.00: ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఇంచార్జ్ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీతో సమావేశం
- 05.00-06.00: సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, ఇంచార్జ్ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీతో సమావేశం
- 06.00-07.00: యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఇంచార్జ్, ఎగ్జిక్యూటివ్ కమిటీతో సమావేశం
- 07.00-08.00: ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇంచార్జ్ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీతో సమావేశం
- శనివారం రాత్రికి హైదరాబాద్లో బస
జనవరి 22, ఆదివారం షెడ్యూల్:
- 10.00-02.00: సీనియర్ నేతలతో సమావేశం
- 03.00: నాగర్కర్నూల్ కు బయలుదేరడం
- 07.30: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం, శంషాబాద్ కు చేరుకోవడం
- 8.30: పూణేకు తిరుగుప్రయాణం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE