తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిభింబించే ప్రధాన పండగల్లో బోనాలు ఒకటి. బోనాలు అనేది తెలంగాణలో ఒక నెలపాటు ఆషాడమాసంలో అమ్మవారికి చేసే ‘బోనం’ అని పిలువబడే కృతజ్ఞతా నైవేద్యాలతో జరుపుకునే ఒక ప్రత్యేకమైన పండుగ. ఈ బోనాల ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. గోల్కొండ వద్ద కొలువు తీరిన జగదాంబిక అమ్మవారికి ప్రథమ పూజ నిర్వహించడంతో బోనాల సంబరాలు లాంఛనంగా ప్రారంభమవుతాయి. గురువారం నుంచి నెలరోజుల పాటు జరిగే బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సకల సన్నాహాలు పూర్తి చేశారు. సికింద్రాబాద్లోని ప్రముఖ ఉజ్జయిని మహంకాళి జాతర జూలై 17న, లాల్ దర్వాజా ప్రాంతంలో జూలై 24న జరగనుంది.
ఇక ఈరోజు లంగర్హౌస్ చౌరస్తా నుండి భారీ ఊరేగింపుగా గోల్కొండ కోట లోని జగదాంబిక అమ్మవారికి నజర్ బోనం, తొట్టెలను తీసుకెళ్లనున్నారు. ఈ ఊరేగింపుకు డప్పు వాద్యాలు, పోతరాజుల నృత్యాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. గురువారం మధ్యాహ్నం ప్రారంభమయ్యే ఊరేగింపు సుమారు రాత్రి 8 గంటలకు అమ్మవారి ఆలయానికి చేరుకోనుంది. ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇక జులై 10న సామూహిక బోనాల ఊరేగింపు నిర్వహించనున్నారు. కోట లోపల, భక్తులు సజావుగా వెళ్లేందుకు మరియు రద్దీని నిరోధించడానికి గుడారాలు నిర్మించబడ్డాయి. అలాగే భక్తుల సౌకర్యార్ధం అటూ ఇటూ రెయిలింగ్లు ఏర్పాటు చేయబడ్డాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ