ప్రముఖ దక్షిణాది నటుడు ప్రభు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. ప్రస్తుతం ఆయన చెన్నై లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా గత కొంతకాలంగా ప్రభు కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మంగళవారం తనకు తీవ్రమైన కడుపునొప్పి ఉందని కుటుంబ సభ్యులకు తెలుపడంతో వారు హుటాహుటిన ఆయనను చెన్నైలోని మెడ్వే ఆస్పత్రిలో చేర్పించారు. స్కానింగ్లో ఆయనకు కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వైద్యులు వెంటనే ప్రభుకు లేజర్ ఎండోస్కోపీ సర్జరీ చేసి రాళ్లను తొలగించారు. సర్జరీ తర్వాత ప్రభు ఆరోగ్యం నిలకడగా ఉందని, నెమ్మదిగా కోలుకుంటున్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
దీని తర్వాత కొన్ని సాధారణ పరీక్షలు చేసి ఒకటి లేదా రెండు రోజుల్లో ఆయనను డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పినట్లు సమాచారం. ఇక ఈ వార్త తెలియడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రభు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా ప్రభు మాతృభాష తమిళంతో పాటు తెలుగు, మలయాళం మరియు కన్నడ చిత్రాలలో కూడా నటిస్తున్నారు. ప్రభు తెలుగులో.. చంద్రముఖి, డార్లింగ్, వీడోక్కడే, ఆరెంజ్, దరువు, ఇటీవలే విడుదలైన వారసుడు వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పొన్నియన్ సెల్వన్-2’లో నటిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE