ఏపీలో టీడీపీ-జనసేన సీట్ల సర్దబాటు గురించి.. జనసేనాని పవన్ పోటీ చేయబోయే స్థానం గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఒక అంశంపై మాత్రం ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఈసారి జనసేన 24 అసెంబ్లీ.. 3 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారనేదానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్.. భీమవరం, గాజువాక స్థానాల నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓటమిపాలయ్యారు.
వచ్చే ఎన్నికల్లో పవన్ మరోసారి భీమవరం నుంచి బరిలోకి దిగబోతున్నారని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. పవన్ కూడా ఇటీవల భీమవరం వెళ్లారు. పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. అటు స్వయంగా టీడీపీ నేతల ఇళ్లకు వెళ్లి.. వచ్చే ఎన్నికల్లో తమ మద్ధతు కోరారు. దీంతో పవన్ భీమవరం నుంచి పోటీ చేయడం ఖాయమని గుసగుసలు వినిపించాయి. కానీ ఇప్పుడు మరో కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో పవన్ భీమవరం నుంచి పోటీ చేయడం లేదని వార్తలు వైరలవుతున్నాయి.
ఇటీవల మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులుని పిలిపించుకొని పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన్ను భీమవరం నుంచి పోటీ చేయాలని కోరారు. తాజాగా ఇదే విషయాన్ని రామాంజనేయులు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ తనను పిలుపించుకొని మాట్లాడారని.. వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేయాలని కోరారని స్పష్టం చేశారు. కానీ ఆ స్థానం నుంచి పవన్ పోటీ చేస్తేనే బాగుంటుందన్న రామాంజనేయులు.. ఒకవేళ పవన్ కాకుండా ఆ స్థానం నుంచి ఎవరు పోటీ చేసినా తాను పూర్తి మద్ధతు ఇస్తానని వెల్లడించారు.
అంతేకాకుండా తాను త్వరలోనే జనసేన పార్టీలో చేరబోతున్నట్లు రామాంజనేయులు ప్రకటించారు. భీమవరంలో రామాంజనేయులు కీలక నేతగా ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం రామాంజనేయులుకు ఉంది. ఈక్రమంలో ఆయన్ను పార్టీలోకి తీసుకోవడం ద్వారా.. పార్టీ మరింత బలోపేతం అవుతుందని పవన్ అనుకుంటున్నారట. అందుకే తాను పోటీ చేయకపోయినా.. రామాంజనేయులను భీమవరం నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారట.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE