ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షల నిర్వహణలో ఏపీ ప్రభుత్వం మరో రికార్డు సృష్టించింది. ఇప్పటిదాకా 3 లక్షలకు పైగా కరోనా వైద్య పరీక్షలను నిర్వహించింది. రాష్ట్రంలో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 3 లక్షల దాటినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ప్రతి మిలియన్ జనాభాకు 5699 కరోనా వైద్య పరీక్షలు చేస్తూ ఏపీ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1807 కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారని, రికవరీ రేటు కూడా రికార్డు స్థాయిలో 68 శాతం ఉందని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu