కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, కరోనా కేసుల వివరాలు, కరోనా వ్యాప్తి చెందుతున్న విధానం తదితర అంశాలపై చర్చించేందుకు వివిధ రాష్ట్రాల సీఎంలతో ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తెలుసుకున్న పీఎం మోదీ మే 3 తరువాత కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ పొడిగింపునకే మొగ్గు చూపినట్లుగా సమాచారం.
ముఖ్యంగా దేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో(హాట్ స్పాట్స్, కంటైన్మెంట్ క్లస్టర్స్, రెడ్ జోన్స్) లాక్డౌన్ కొనసాగింపునకే నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో పాల్గోన్న సీఎంలు ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు, పాజిటివ్ కేసులు నమోదవుతున్న తీరు ప్రధానికి వివరించి లాక్డౌన్ ను పొడగింపుకు సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. గోవా, మేఘాలయ సీఎంలు మే 3 తర్వాత లాక్డౌన్ పెంచాలని స్పష్టం చేశారు. అయితే నిత్యావసరాల వస్తువుల సరఫరాతో పాటుగా మరికొన్ని ఆర్ధిక వ్యవహారాలకు అనుమతించాలని సీఎంలు సూచించినట్టు తెలుస్తోంది.
అనంతరం పీఎం మోదీ మాట్లాడుతూ, దేశంలో లాక్డౌన్ సానుకూల ఫలితాలను ఇచ్చింది, గత నెలన్నరలో దేశంలో వేలాది మంది ప్రాణాలను రక్షించగలిగాం. కరోనా విషయంలో ఒక లక్ష్యంతో వేగవంతంగా స్పందించాలి. కరోనా వ్యాప్తి ఎక్కువున్నరెడ్ జోన్స్ ను ఆరంజ్ జోన్స్ గా మార్చడానికి, ఆ తరువాత గ్రీన్ జోన్లుగా మార్చడానికి రాష్ట్రాల ప్రయత్నాలు ముమ్మరం చేయాలని పీఎం మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు ధైర్యంగా వ్యవహరిస్తూ సాధారణ పౌరులు, పేదలు జీవితాలను మార్చే సంస్కరణలను తీసుకురావాలి. ఆర్థిక వ్యవస్థకు ప్రాముఖ్యత ఇవ్వడంతో పాటుగా కరోనా వైరస్ కి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలి. కరోనావైరస్ యొక్క ప్రభావం రాబోయే నెలల్లో కూడా కనిపిస్తుంది. మాస్కులు మరియు ఫేస్ కవర్లు ధరించడం ఇకపై కొన్నాళ్ళు మన జీవితంలో భాగంగా ఉంటాయని పీఎం మోదీ పేర్కొనట్టుగా సమాచారం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]