మద్యం టెండర్ దరఖాస్తు దారులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు..

AP Government Good News On Liquor Tender Application

మద్యం టెండర్ దరకాస్తు దారులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన మద్యం పాలసీలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం షాపులను రద్దుచేసి ప్రైవేట్ వారికి మద్యం షాపుల లైసెన్సులు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3396 మద్యం షాపులకు లైసెన్సులు ఇచ్చేందుకు నోటిఫికేషన్ ఇవ్వగా మొత్తం ఏడు రోజుల వ్యవధిలో 20,310 దరఖాస్తులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల లైసెన్సులకు సగటున ఒక్కో షాపుకు ఆరు చొప్పున దరఖాస్తులు వచ్చినట్టుగా తెలుస్తుంది. కొన్ని జిల్లాలలో మద్యం షాపుల దరఖాస్తులకు తీవ్రమైన పోటీ నెలకొంది. ఏపీలోని విజయనగరం జిల్లాలో 153 దుకాణాలు నోటిఫై చేయగా అక్కడ 1689 దరఖాస్తులు ఇప్పటి వరకు వచ్చాయి. ఇక ఇప్పటివరకు నాన్ రిఫండబుల్ రుసుముల రూపంలో ఏపీ ప్రభుత్వానికి 406.20 కోట్ల రూపాయల ఆదాయం మద్యం షాపుల దరఖాస్తులపైన సమకూరింది.

మద్యం షాపుల దరఖాస్తులకు బుధవారం ఆఖరి రోజు కావడంతో వేలసంఖ్యలో దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం మద్యం టెండర్ల షెడ్యూల్లో మార్పులు చేసింది. ఈ నెల11వ తేదీ సాయంత్రం 5 గంటలకు వరకు దరఖాస్తులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. దరఖాస్తులు 11వ తేదీన సాయంత్రం 5గంటలకు ముగియగ, 14వ తేదీన డ్రా తీయనున్నట్లు.. 16వ తేదీ నుంచి కొత్త దుకాణాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. మద్యం టెండర్ల షెడ్యూలును మార్చాలని ప్రభుత్వానికి పలువురు నుంచి విఙప్తులు వచ్చాయి. దసరా సెలవులు కావడంతో బ్యాంకులు పని చేయవని పలువురు దరఖాస్తుదారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మద్యం పాలసీలో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేయనున్న 123 ప్రభుత్వ మద్యం దుకాణాలకు ఈ నెల 11వ తేదీన లాటరీ నిర్వహించనున్నారు. మచిలీపట్నంలోని నోబుల్‌ కళాశాల ప్రాంగణంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయించనున్నారు. ఇందు కోసం ఎనిమిది కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎనిమిది మంది ప్రత్యేక అధికారులు పర్యవేక్షిస్తారు. మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రెండు బ్యాంకు కౌంటర్లలో నిర్దేశించిన నగదును చెల్లిస్తే వెంటనే 15 రోజులకు సరిపడా లైసెన్సును మంజూరు చేస్తారు. ఈ నెల 14వ తేదీ నుంచి మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయి.