కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ మూడో విడతలో కేంద్ర ప్రభుత్వం గణనీయమైన సడలింపులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తమిళనాడు ప్రభుత్వం మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వగా, ఆ తర్వాతి రోజే మద్యం దుకాణాల్ని మూసేయాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. మద్యం కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్దఎత్తున దుకాణాల వద్దకు చేరుకుంటున్నారని, భౌతిక దూరం పాటించకపోవడంతో వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు హైకోర్టు వెల్లడిందించింది. అయితే ఆన్లైన్ విధానం ద్వారా మద్యం హోమ్ డెలివరీ చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. కాగా హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తమిళనాడు ప్రభుత్వం భావిస్తుంది.
మరోవైపు మే 8, గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగినట్టు తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పోరేషన్ (టీఏఎస్ఎమ్ఏసీ) ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 5,146 మద్యం దుకాణాలు ఉండగా వాటిలో 3,750 దుకాణాలు తెరిచామని, వాటినుంచే గురువారం నాడు రూ.172.59 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని చెప్పారు. ఇంత పెద్ద స్థాయిలో అమ్మకాలు జరగడం మాత్రం ఇదే తొలిసారని టీఏఎస్ఎమ్ఏసీ తెలిపింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu