ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మే 9, శనివారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1930 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,388 సాంపిల్స్ కి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా కొత్తగా 43 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కొత్తగా కృష్ణా జిల్లాలో 16, చిత్తూరు జిల్లాలో 11, కర్నూల్ జిల్లాలో 6, విశాఖపట్నం జిల్లాలో 5, అనంతపూర్ జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో 2 చొప్పున మొత్తం 43 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1930 కు పెరిగింది.
రాష్ట్రంలో నమోదైన మొత్తం 1930 పాజిటివ్ కేసులకు గాను 887 మంది డిశ్చార్జ్ కాగా, 44 మంది మరణించారు. గత 24 గంటల్లో 45 మంది కోవిడ్-19 నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అవ్వగా, కృష్ణా లో ఇద్దరు మరియు కర్నూల్ జిల్లాలో ఒక్కరు మరణించినట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల్లో 999 మంది చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య:
- అనంతపూర్ – 102
- చిత్తూరు – 96
- కర్నూల్ – 553
- కడప – 96
- తూర్పుగోదావరి – 46
- పశ్చిమ గోదావరి – 68
- నెల్లూరు -96
- ప్రకాశం – 61
- గుంటూరు – 376
- కృష్ణా – 338
- శ్రీకాకుళం – 5
- విజయనగరం – 4
- విశాఖపట్నం – 62
- ఇతరులు (గుజరాత్ నుంచి వచ్చిన వారు 26 మంది, కర్ణాటక నుంచి ఒక్కరు )-27
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu