కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) టెక్ దిగ్గజం గూగుల్ సంస్థకు షాక్ ఇచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ విధానాలకు సంబంధించి ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేయడం, విరమణ ఆర్డర్ జారీ చేయడం వంటి కారణాల కారణంగా మంగళవారం గూగుల్కు రూ. 936.44 కోట్ల జరిమానా విధించింది. ప్లేస్టోర్ పాలసీల విషయంలో గూగుల్ అనైతిక వ్యాపార విధానాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని సీసీఐ పేర్కొంది. అంతేకాకుండా నిర్ణీత కాలవ్యవధిలోగా గూగుల్ తన తీరును మార్చుకోవాలని స్పష్టం చేసింది. ఆ సంస్థకు సీసీఐ జరిమానా విధించడం వారం రోజుల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. కాగా ఐదు రోజుల క్రితమే ఆండ్రాయిడ్ మొబైల్ పరికరాలకు సంబంధించిన పోటీ వ్యతిరేక పద్ధతులు వినియోగించినందున గూగుల్కు రూ. 1,337 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సీసీఐ జరిమానాపై గూగుల్ స్పందించింది. ఆండ్రాయిడ్ మరియు గూగుల్ ప్లే అందించే సాంకేతికత, భద్రత, రక్షణ మరియు సౌలభ్యం వంటి ప్రయోజనాలను భారతీయ డెవలపర్లు పొందారని పేర్కొంది. ఇక తక్కువ ఖర్చుతో లభించే తమ మోడల్ భారతదేశం యొక్క డిజిటల్ పరివర్తనకు శక్తినిచ్చిందని, వందల మిలియన్ల మంది భారతీయులకు నిరాటంకంగా సేవలను అందించిందని వివరించింది. తాము వినియోగదారులు మరియు డెవలపర్లకు మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని, తదుపరి దశలను మూల్యాంకనం చేసే నిర్ణయాన్ని సమీక్షిస్తున్నామని అని గూగుల్ ప్రతినిధి తెలిపారు. కేవలం వారం వ్యవధిలో రెండు పర్యాయాలు గూగుల్కి సీసీఐ దాదాపు రూ. 2,300కోట్లకు పైగా జరిమానాలు విధించడం విశేషం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY