కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు కర్ణాటక సీఎం యడియూరప్ప చెప్పారు. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన ప్రజలు మే 31 వ తేదీవరకు కర్ణాటక రాష్ట్రంలోకి రావడానికి వీల్లేదని ప్రకటించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అన్ని దుకాణాలు తెరవడానికి అనుమతిస్తున్నామని, రాష్ట్ర పరిధిలో బస్సులు, రైళ్లు, క్యాబ్లు కూడా తిరగడానికి అనుమతిస్తామని చెప్పారు.
అయితే ఆదివారం రోజు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉంటుందని సీఎం యడియూరప్ప స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేసి, ఇతర ప్రాంతాల్లో అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలకు అనుమతులు జారీ చేస్తామని తెలిపారు. అలాగే ఉదయం 7 నుంచి 9 గంటల వరకు మరియు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు పార్కులు తెరవడానికి అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు విధించే కర్ఫ్యూ కర్ణాటక రాష్ట్రంలో కూడా కొనసాగుతుందని సీఎం యడియూరప్ప తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]