కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10 వ తరగతి, 12 వ తరగతి పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ముందుగా ఈ పరీక్షలను జూలై 1 వ నుంచి 15 తేదీ వరకు నిర్వహిస్తామని వెల్లడించారు. కాగా మే 18, సోమవారం నాడు ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను సీబీఎస్ఈ బోర్డు వెల్లడించింది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, శానిటైజర్స్ వెంట ఉంచుకోవాలని నిబంధనల్లో పేర్కొన్నారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులను పరీక్షలకు అనుమతించబోమని తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించిన వివరాలను కేంద్ర హెచ్చార్డీ శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu