కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో సుదీర్ఘంగా లాక్డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ 4.0 ను మే 31 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలకు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో లాక్డౌన్ సడలింపులపై అనేక సలహాలు వస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. లాక్డౌన్ సడలింపులపై చర్చించడానికి సీఎం కేసీఆర్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారని, వస్తున్న అన్ని సూచనలను, సలహాలను పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి కేటిఆర్ తెలిపారు.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన మే 18, సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ కీలక సమావేశం జరుగనుంది. లాక్ డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేసే విధివిధానాలపై కూడా చర్చించనున్నారు.
Have been receiving number of suggestions on the relaxations needed in view of prolonged #Lockdown & latest guidelines from Govt of India
Hon’ble CM KCR Garu has convened a cabinet meeting today at 5pm to discuss the same. We will take all suggestions into consideration today👍
— KTR (@KTRTRS) May 18, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu