కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో లాక్డౌన్ సుదీర్ఘంగా అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలలో 10, 12వ తరగతి పరీక్షల నిర్వహణ వాయిదా పడింది. ఈ క్రమంలో పరీక్షల నిర్వహణపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా 10, 12వ తరగతి పరీక్షల నిర్వహణకు అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని ఈ పరీక్షలను నిర్వహించుకునేందుకు లాక్డౌన్ నుంచి రాష్ట్రాలకు మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన సడలింపుల నిబంధనలపై రాష్ట్రాలకు సమాచారం ఇచ్చినట్టు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణ సందర్భంగా విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా చూడడం, ఫేస్మాస్కులు ధరించడం తప్పనిసరని హోం శాఖ మంత్రి అమిత్షా ట్వీట్ చేశారు.
మరోవైపు పరీక్షల నిర్వహణకు సంబంధించిన సడలింపులపై హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు ఈ రోజు లేఖ రాశారు. పరీక్షలకు నిర్వహణపై రాష్ట్రాలు, సీబీఎస్ఈ బోర్డు నుంచి వచ్చిన విజ్ఞప్తులపై సమీక్ష చేసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ పక్రియలో లాక్డౌన్ నిబంధనలు పాటించాలని చెప్పారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలను చేరుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే రాష్ట్రాల పరిధిలోని కంటైన్మెంట్ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు అనుమతి లేదని చెప్పారు. విధులకు హాజరయ్యే ఉపాధ్యాయులు, సిబ్బంది, పరీక్ష రాసే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు, పరీక్ష కేంద్రాలు శానిటైజ్ చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.
In interest of large number of students, conduct of 10th and 12th Board Examinations exempted from #lockdown Measures: HM Shri @AmitShah
Different Boards to stagger their Examination Schedules; Adherence to Health/Hygiene protocols mandatory.#COVID19
📝https://t.co/WvWckmtT9e pic.twitter.com/LsFJAQS8jp
— Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) May 20, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu