దేశవ్యాప్తంగా జూన్ 1 వ తేదీ నుంచి రోజువారీగా 200 రైళ్లను నడపనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జూన్ 1 నుంచి నడిచే రైళ్ల జాబితాను మే 20, బుధవారం నాడు రైల్వేశాఖ ప్రకటించింది. మే 21, గురువారం ఉదయం 10 గంటల నుంచి ఈ రైళ్లకు సంబంధించిన బుకింగ్స్ మొదలవుతాయని చెప్పారు. ఇవి రోజువారీగా రాకపోకలు సాగించే రైళ్ళే అయినా కూడా వీటిని ప్రత్యేక రైళ్లగానే పరిగణిస్తామని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఆన్లైన్లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని, సంబంధిత రైల్వే స్టేషన్స్ లో బుకింగ్ కౌంటర్స్ తెరచుకోవని పేర్కొన్నారు. ఈ రైళ్ల నడిచే సమయాలు, ఆగే స్టేషన్స్ అన్ని గతంలో లాగానే ఉంటాయని చెప్పారు. ఇక వీటిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 8 రైళ్లు నడవనున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్ల వివరాలు:
- ముంబై – హైదరాబాద్ – (02701/02) – హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్ – డైలీ
- హౌరా – సికింద్రాబాద్ – (02703/04) – ఫలక్ నామా ఎక్స్ ప్రెస్ – డైలీ
- హైదరాబాద్ – న్యూఢిల్లీ – (02723/24) – తెలంగాణ ఎక్స్ ప్రెస్ – డైలీ
- విశాఖ – న్యూఢిల్లీ – (02805/06) – ఏపీ ఎక్స్ ప్రెస్ – డైలీ
- దానాపూర్ – సికింద్రాబాద్ – (02791/92) – దానాపూర్ ఎక్స్ ప్రెస్ -డైలీ
- గుంటూరు – సికింద్రాబాద్ – (07201/02) – గోల్కొండ ఎక్స్ ప్రెస్ – డైలీ
- తిరుపతి – నిజామాబాద్ -(02793/94) – రాయలసీమ ఎక్స్ ప్రెస్ – డైలీ
- హైదరాబాద్ – విశాఖ – (02727/08) – గోదావరి ఎక్స్ ప్రెస్ – డైలీ
- దురంతో రైళ్లు: సికింద్రాబాద్ – నిజాముద్దీన్ – (02285/86) – వారానికి రెండుసార్లు
- దురంతో ఎక్స్ ప్రెస్: హౌరా – యశ్వంత్ పూర్ – (02245/46) – వయా విజయవాడ – వారానికి ఐదు రోజులు
- ముంబై సీఎస్టి – భువనేశ్వర్ – (01019/20) – కోణార్క్ ఎక్స్ ప్రెస్ – వయా సికింద్రాబాద్, విజయవాడ – డైలీ
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu