ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 15 మంది ఐపీఎస్ ఆఫీసర్ల బదిలీ చోటుచేసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ మంగళవారం ఒక జీవో విడుదల చేశారు. కాగా ఇది తక్షణమే అమలు కావాలని ఆదేశాలు ఇచ్చారు. బదిలీ అయిన వారిలో.. అజిత వేజెండ్ల, బిందు మాధవ్ గరికపాటి, గోపీనాథ్ జట్టి, ఎస్ హరికృష్ణ, పి జగదీష్, జీ కృష్ణకాంత్, కేవీ మోహన్ రావు, ఎల్కేవీ రంగారావు, ఎస్వీ రాజశేఖర బాబు, పీహెచ్డీ రామకృష్ణ, రవీంద్రనాథ్ బాబు, కోయ ప్రవీణ్, విశాల్ గున్నీ, తుహిన్ సిన్హా తదితరులు ఉన్నారు.
అదనపు బాధ్యతలు అందుకున్నవారు
- విజయవాడ రైల్వే ఎస్పీగా విశాల్ గున్నీ
- శాంతి భద్రతల డీఐజీగా ఎస్వీ రాజశేఖర బాబు
- కోస్టల్ సెక్యూరిటీ డీఐజీగా ఎస్ హరికృష్ణ
- న్యాయవ్యవహారాల ఐజీపీగా గోపీనాథ్ జట్టి
- గుంతకల్లు రైల్వే పోలీస్ సూపరింటెండెంట్గా అజిత వేజెండ్ల
- కాకినాడ థర్డ్ బెటాలియన్ ఇంఛార్జిగా రవీంద్రనాథ్ బాబు
- పల్నాడు అదనపు ఎస్పీ అడ్మిన్గా బిందు మాధవ్
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ