ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) యూనిట్ను పునరుద్ధరించేందుకు సమీక్ష చేసి, సానుకూల నిర్ణయం తీసుకోవాలని కేంద్ర వాణిజ్యం అండ్ పరిశ్రమలు శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సీసీఐ పరిశ్రమ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి అవసరమైన అన్ని మద్దతులను అందిస్తామని చెప్పారు. ఆదిలాబాద్లోని వేలాది మంది యువతకు ఉపాధి పొందేలా చేయడానికి అవసరమైన ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
కాగా ఆదిలాబాద్ జిల్లాలోని సీసీఐ పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఓవైపు జిల్లాలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా సీసీఐను పునరుద్ధరించాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుండగా, మరోవైపు ఆ సంస్థలోని యంత్ర సామాగ్రిని స్క్రాప్ కింద వేలం వేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కేంద్రం నిర్ణయంపై ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు నిరసన వ్యక్తం చేస్తూ, సంస్థ పునరుద్ధరణకే కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF