ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన అక్టోబర్ 28, గురువారం నాడు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన అనంతరం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు:
- నవంబర్ 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ.
- ఆన్లైన్లో టికెట్ల విక్రయాల పోర్టల్ నేపథ్యంలో సినిమాటోగ్రఫీ చట్ట సవరణ ప్రతిపాదనలకు ఆర్డినెన్స్ ఆమోదం.
- అమ్మఒడి పథకానికి 75 శాతం హాజరు తప్పనిసరి చేస్తూ నిర్ణయం.
- బీసీ జనగణనను కులాల వారీగా చేసేలా అసెంబ్లీలో తీర్మానానికి కేబినెట్ ఆమోదం.
- శ్రీశారదా పీఠానికి కొత్తవలసలో 15 ఎకరాల కేటాయింపుకు ఆమోదం.
- వైద్య, విద్య, కుటుంబ సంక్షేమశాఖలో ఉద్యోగాల భర్తీ. కొత్తగా 4,035 కొత్త ఉద్యోగాలకు ఆమోదం.
- రైతులకు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్ ఇచ్చేలా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందానికి ఆమోదం.
- కొత్తగా జైన్ మరియు సిక్కుల కార్పొరేషన్ల ఏర్పాటుకు నిర్ణయం.
- అనంతపురం జిల్లాలో వేదపాఠశాల, సంస్కృత పాఠశాల ఏర్పాటు.
- ప్రకాశం జిల్లాలో జేఎన్టీయూ, గురజాడ వర్సిటీలకు ఆమోదం.
- అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు.
- పీపీపీ విధానంలో శిల్పారామం అభివృద్ధికి ఆమోదం.
- జయలక్ష్మీ నరసింహ శాస్త్రి గుండ్లూరు ట్రస్ట్కు అనంతపురం జిల్లా బొమ్మేపర్తిలో 17.49 ఎకరాల కేటాయింపు.
- రాష్ట్రవ్యాప్తంగా 5చోట్ల సెవన్ స్టార్ పర్యాటక రిసార్ట్ల ఏర్పాటు కోసం భూముల కేటాయింపుకు ఆమోదం.
- మావోయిస్టులు, అనుబంధ సంస్థలపై నిషేధం మరోఏడాది పొడిగింపు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ