ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్చ్ 3, మంగళవారం నాడు ఎన్పీఆర్ అంశంపై తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి కీలక ట్వీట్ చేశారు. ” జాతీయ పౌర పట్టిక(ఎన్పీఆర్)లో ప్రతిపాదించిన కొన్ని ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మైనారిటీల్లో అభద్రతాభావానికి కారణమవుతున్నాయి. మా పార్టీలో విస్తృతమైన సంప్రదింపుల జరిపిన తరువాత, 2010 లో ఉన్న నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాలని మేము నిర్ణయించుకున్నాము. ఈ మేరకు, రాబోయే అసెంబ్లీ సమావేశాలలో ఎన్పీఆర్ అంశంపై అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టబోతున్నామని” సీఎం వైఎస్ జగన్ ట్వీట్ లో పేర్కొన్నారు. మంగళవారం నాడు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా నేతృత్వంలో ముస్లిం మైనారిటీ ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్పీఆర్, సీఏఏలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని వారు సీఎంను కోరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎన్పీఆర్పై సీఎం వైఎస్ జగన్ కీలక ట్వీట్ చేసినట్టుగా తెలుస్తుంది.
Some of the questions proposed in the NPR are causing insecurities in the minds of minorities of my state. After elaborate consultations within our party, we have decided to request the Central Government to revert the conditions to those prevailing in 2010. (1/2)
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 3, 2020
To this effect, we will also introduce a resolution in the upcoming assembly session. (2/2)
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 3, 2020
[subscribe]