కోవిడ్ కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం

10 killed in blaze at COVID-19 care facility in Vijayawada, 10 Killed in Massive Fire at Vijayawada Covid-19 Care, Andhra Pradesh, Andhra Pradesh Vijayawada Coronavirus, CM YS Jagan Announces Rs 50 Lakh Compensation, Coronavirus, Vijayawada, Vijayawada Fire Accident, Vijayawada hotel fire

విజయవాడ లోని కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై సీఎం వైఎస్‌ జగన్ ‌మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు. అగ్ని ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ముందుగా ఈ ఘటనపై సీఎం ఆరా తీశారు. సీఎంఓ అధికారులు ఘటన వివరాలను సీఎంకు తెలియజేశారు. ఒక ప్రైవేటు ఆస్పత్రి ఈ హోటల్‌ను లీజుకు తీసుకుందని, అందులో కరోనా వైరస్‌ సోకిన పేషెంట్లను పెట్టినట్టుగా ప్రాథమిక విచారణలో వెల్లడైందని అధికారులు సీఎంకు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఘటనపై లోతుగా విచారణ జరపాలని, ఘటన పూర్వాపరాలను తనకు నివేదించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 11 కి చేరినట్లుగా తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =