ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. శనివారం తాడేపల్లిలో తమ నివాసంలో ఆయన కుటుంబ సమేతంగా పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతితో కలిసి ముందుగా జ్యోతిని వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం సీఎం దంపతులు గోమాతకు పూజలు చేశారు. ఆ తర్వాత భోగి మంటను వెలిగించిన సీఎం దంపతులు హరిదాసుల కీర్తనలు విని ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జానపద కళాకారులు సాంప్రదాయ గీతాలు పాడి అలరించారు. బాల గాయని ప్రకృతి రెడ్డి ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘కొమ్మా ఉయ్యాలా, కోన జంపాలా’ పాట పాడి ముఖ్యమంత్రి దంపతుల అభినందనలు అందుకుంది. అలాగే ప్రఖ్యాత శాస్త్రీయ నృత్య కళాకారుడు ఆనంద్ నేతృత్వంలోని బృందం శ్రీనివాస కళ్యాణం ప్రదర్శన ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE