రేపు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పర్యటించనున్న సీఎం జగన్

AP CM YS Jagan To Visit Narasapuram West Godavari District Tomorrow,AP CM YS Jagan Narasapuram Visit,Jagan Narasapuram Tour,CM YS Jagan Narasapuram Tour,Mango News,Mango News Telugu,AP CM YS Jagan Mohan Reddy ,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates,Narasapuram News And Latest Updates,West Godavari District News And Updates

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా రేపు ఆయన నర్సాపురంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్, సబ్ స్టేషన్ నిర్మాణం, కాళీపట్నం రెగ్యులేటర్ల నిర్మాణం, ఆర్టీసీ బస్టాండ్, 100 పడకల ఆసుపత్రి, షిప్పింగ్ హార్బర్, ఆక్వా యూనివర్సిటీ వంటి వాటికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో రేపు జరగనున్న సీఎం జగన్ పర్యటనకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి ఇప్పటికే నర్సాపురంలో ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై పూర్తి దృష్టి సారించాలని, నక్కవారిపేటలో హెలిప్యాడ్‌ పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని, అలాగే బహిరంగ సభ జరుగనున్న నేపథ్యంలో కార్యక్రమానికి వచ్చే ప్రజలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇక సీఎం పర్యటన ఆసాంతం అప్రమత్తంగా ఉండాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 3 =