ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. దీంతో కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 10093 కేసులు, 65 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 10093 కేసులతో కలిపి జూలై 29, బుధవారం ఉదయం 10 గంటల వరకు కేసుల సంఖ్య 120390 కు చేరింది. మరో 2784 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారు.
గత 24 గంటల్లో 70584 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. కరోనా వలన తూర్పు గోదావరిలో పద్నాలుగు మంది, అనంతపూర్ లో ఎనిమిది మంది, విజయనగరంలో ఏడుగురు, చిత్తూరులో ఆరుగురు, కర్నూల్ లో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, కృష్ణాలో నలుగురు, ప్రకాశంలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, కడపలో ముగ్గురు, శ్రీకాకుళంలో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఒకరు మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 1213 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (జూలై 29, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు: 18,20,009
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 120390
- కొత్తగా నమోదైనా కేసులు : 10093
- నమోదైన మరణాలు : 65
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 55406
- యాక్టీవ్ కేసులు : 63771
- మొత్తం మరణాల సంఖ్య : 1213
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu