ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ‘గడప గడపకు మన ప్రభుత్వం’పై కార్యక్రమంపై వర్క్షాప్ నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ వర్క్షాప్ లో రాష్ట్ర మంత్రులు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు, పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతున్న తీరుపై సమీక్ష జరిపి, నాయకులు అందరికి మార్గనిర్దేశం చేస్తూ కీలక ఆదేశాలు ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ప్రతి నియోజకర్గ అభివృద్ధికి రూ.2 కోట్లు చొప్పున, అలాగే ప్రతి సచివాలయంలో ప్రాధాన్యతా పనులకోసం రూ.20 లక్షల చొప్పున కేటాయిస్తున్నట్టు తెలిపారు. ప్రతి నెల 6 లేదా 7 సచివాలయాలు సందర్శించాలని ఎమ్మెల్యేలను సీఎం ఆదేశించారు. ఆ వెంటనే చేయతలపెట్టిన పనుల కోసం కలెక్టర్ల నుంచి నిధుల విడుదల జరుగుతుందన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నాణ్యత ఉండాలని, జీవితంలో ఏ కార్యక్రమంచేసినా నాణ్యతతో చేస్తేనే నిలదొక్కుకుంటామని, అందుకే క్వాలిటీతో కార్యక్రమాలు చేయడం అన్నది ముఖ్యమని సీఎం వైఎస్ జగన్ ఎమ్మెల్యేలకు సూచించారు.
“రాష్ట్రంలో ఇప్పటికే అనేక పథకాలను అమలు చేశాం, అభివృద్ధి పనులు చేపట్టాం. లక్షలాది కుటుంబాలు మనమీద ఆధారపడి ఉన్నాయి. వారికి న్యాయం జరగాలంటే మళ్ళీ మనం అధికారంలోకి రావాలి. నేను చేయాల్సింది అంతా చేస్తున్నాను. ఎమ్మెల్యేలు కూడా కష్టపడాలి. రాష్ట్రంలో ఎలాంటి వివక్షలేకుండా, అవినీతికి తావు లేకుండా సంక్షేమ కార్యక్రమాలను అందరికీ అందిస్తున్నాం. పథకాలకు బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే పంపుతున్నాం. రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు పథకాలు అందించాం. వారి మద్దతు తీసుకుంటే ఈసారి 175కి 175 స్థానాలో ఎందుకు గెలవలేం?, గడప గడపకు కార్యక్రమంలో భాగంగా రానున్న ఎమ్మెల్యేలు నెలరోజుల్లో 7 సచివాలయాలను సందర్శించాలి. వచ్చే నెలరోజుల్లో కనీసంగా 16 రోజులు, గరిష్టంగా 21రోజులు గడప గడపకు కార్యక్రమంలో పాల్గొనాలి. కమిట్మెంట్తో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. గడప,గడపకూ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షణ చేయాలి. ఇందు కోసం 175 నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించాలి” అని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY