ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి క్రమంగా పెరుగుతుంది. ఏప్రిల్ 7, మంగళవారం నాడు ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 304కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు జరిగిన కరోనా వైరస్ పరీక్షల్లో కొత్తగా గుంటూరులో ఒక కేసు నమోదయినట్టు తెలిపారు. అలాగే కర్నూల్ జిల్లాలో కరోనా వైరస్ వలన ఒకరు మరణించినట్టు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. అలాగే ఇప్పటి వరకు ఆరుగురు కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్టు ప్రకటించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వీరిలో 11 మంది మృతి చెందినట్టు తెలిపారు. 45 మంది ఈ వైరస్ లక్షణాల నుంచి కోలుకోగా, 308 మంది చికిత్స పొందుతునట్టు తెలిపారు.
#CovidUpdates: రాష్ట్రంలో నిన్న సాయంత్రం 6 నుంచి ఈరోజు ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో కొత్త గా గుంటూరు లో ఒక కేసు నమోదయింది. రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసు ల సంఖ్య 304 కి పెరిగింది. కర్నూల్ జిల్లా లో #COVID19 కారణం గా ఒక మరణం నిర్దారించబడింది #APFightsCorona pic.twitter.com/lwUFb66kJL
— ArogyaAndhra (@ArogyaAndhra) April 7, 2020