ఆంధప్రదేశ్ లో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా విజయనగరం జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా 3251 పంచాయతీలు, 32,522 వార్డులకు ఫిబ్రవరి 9 న ఎన్నికలు జరిగేలా నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు ఫిబ్రవరి 4 తేదీ మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. దీంతో పోటీలో నిలిచిన అభ్యర్థులు, ఏకగ్రీవాలపై స్పష్టత వచ్చింది. మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 523 పంచాయతీల్లో సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 110 మంది సర్పంచ్లు, అత్యల్పంగా అనంతపురం జిల్లాలో ఆరుగురు సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మొదటి విడతలో జిల్లాలవారీగా సర్పంచ్ ల ఏకగ్రీవాల వివరాలు:
- కృష్ణా – 23
- గుంటూరు – 67
- ప్రకాశం – 35
- నెల్లూరు – 25
- తూర్పుగోదావరి – 30
- పశ్చిమగోదావరి – 41
- వైఎస్ఆర్ కడప – 51
- అనంతపురం – 6
- చిత్తూరు – 110
- కర్నూల్ – 52
- శ్రీకాకుళం – 39
- విశాఖపట్నం – 44
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ