ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా సినిమా టికెట్ల ధరల అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల అంశాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించేందుకు ఓ కమిటీని ప్రభుత్వం నియమించింది. మొత్తం 13 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీకి హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్ గా, కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అలాగే కమిటీ సభ్యులుగా పురపాలక, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శులు, సమాచార పౌరసంబంధాల కమిషనర్, న్యాయశాఖ కార్యదర్శి, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ తో పాటుగా ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు, సినీ గోయర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఉండనున్నారు. రాష్ట్రంలో ఏఏ థియేటర్స్ లలో, ఎంత టికెట్ ధర ఉండాలి? ధరల పెంపు సహా పలు అంశాలపై ఈ కమిటీ పరిశీలన జరిపి, త్వరలోనే సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ