హైదరాబాద్ నగరంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (ఎస్.ఆర్.డి.పి)లో భాగంగా ఇప్పటికే అనేక ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు అందుబాటులోకి తీసుకురాగా, తాజాగా మరో కీలక ఫ్లై ఓవర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. నగరంలోని ఒవైసీ-మిధాని జంక్షన్ల మధ్య 1.365 కి.మీ పొడవుతో జీహెఛ్ఎంసీ నిర్మించిన ఫ్లై ఓవర్ ను మంగళవారం నాడు మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రారంభించారు. మొత్తం రూ.80 కోట్ల నిర్మాణ వ్యయంతో మూడు లేన్లతో ఈ ఫ్లై ఓవర్ ను నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో పాతబస్తీ నుంచి ఎల్బీ నగర్ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తొలగనున్నాయి.
మరోవైపు ఈ ఫ్లై ఓవర్ కు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టాలని నిర్ణయించుకున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. డిఆర్డీఓలో పనిచేయడం సహా ఒక దశాబ్దానికి పైగా ఈ పరిసరాల్లో నివసించిన గొప్ప వ్యక్తికి చిన్న నివాళిగా ఈ ఫ్లై ఓవర్ కు ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెడుతున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ