తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో వంశపారంపర్య అర్చకుల శాశ్వత నియామకంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంశపారంపర్యంగా వచ్చే అర్చకుల శాశ్వత నియామకంపై ఏకసభ్య కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వారసత్వ అర్చకుల వ్యవస్థ బలోపేతం, క్రమబద్ధీకరణపై తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ సూచించనుంది. కమిటీ ఛైర్మన్గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి బి.శివ శంకర్రావును నియమించారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో వారసత్వ అర్చకుల శాశ్వత నియామకం ఉందని, ఈ నేపథ్యంలో టీటీడీ అర్చకులు, భక్తుల విజ్ఞప్తులతో ఏకసభ్య కమిటీని నియమించినట్లు తెలిపారు. అర్చకుల శాశ్వత నియామకాలపై అధ్యయనం చేసి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఏకసభ్య కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ