టోక్యో ఒలింపిక్స్-2020లో సిల్వర్ మెడల్ (రజత పతకం) గెలుచుకున్న వెయిట్ లిఫ్టర్ మీరాభాయి చానుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్ ప్రారంభమైన తొలిరోజే భారత్ పతకాన్ని కైవసం చేసుకోవడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను సిల్వర్ మెడల్ సాధించడం గొప్ప విషయమన్నారు. మీరాభాయికి సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తిని మన క్రీడాకారులు కొనసాగించి మరిన్ని పతకాలను దేశానికి సాధించిపెట్టాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
“అద్భుతమైన ప్రదర్శన. టోక్యో ఒలింపిక్స్-2020లో భారత్ పతకాల సంఖ్య ప్రారంభం కావడం చాలా ఆనందంగా ఉంది. మహిళల 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించినందుకు మీరాబాయి చానుకి హృదయపూర్వక అభినందనలు” అని ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ