దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కరోనా మరణాలు, రోజువారీ కేసుల్లో మళ్ళీ పెరుగుదల కనిపిస్తుంది. గత 24 గంటల్లో కొత్తగా 42,015 కేసులు, 3998 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,12,16,337 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,18,480 కి పెరిగింది. మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్యను సవరించడంతో గత 24 గంటల్లో మొత్తం మరణాల సంఖ్య పెరిగింది. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, అస్సాం, కర్ణాటక, మణిపూర్, వెస్ట్ బెంగాల్, తెలంగాణ వంటి 10 రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 36,977 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 3,03,90,687 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 97.36 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.34 శాతంగా నమోదైంది.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన 10 రాష్ట్రాలివే (జూలై 20 8am–జూలై 21 8am):
- కేరళ – 16848
- మహారాష్ట్ర – 9389
- ఆంధ్రప్రదేశ్ – 2498
- తమిళనాడు – 1904
- ఒడిశా – 2085
- అస్సాం – 1798
- కర్ణాటక – 1464
- మణిపూర్ – 1127
- వెస్ట్ బెంగాల్ – 752
- తెలంగాణ – 657
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ