ఏపీలో పంచాయతీ ఏకగ్రీవాల జోరు, మూడో విడతలో 579 ఏకగ్రీవం

AP Third Phase Panchayat Elections: 579 Sarpanches Unanimously Elected,Mango News,Mango News Telugu,AP Gram Panchayat elections 2021: 579 gram panchayats ended unanimous in the third phase,AP Third Phase Panchayat Elections,AP Third Phase Panchayat Elections 2021,Andhra Pradesh Third Phase Panchayat Elections,Andhra Pradesh Third Phase Panchayat Elections 2021

మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆంధప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 3221 పంచాయతీలకు ఫిబ్రవరి 17న ఎన్నికలు జరిగేలా నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు ఫిబ్రవరి 12 తేదీ మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. దీంతో పంచాయతీల ఏకగ్రీవాలపై స్పష్టత వచ్చింది. మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 579 పంచాయతీలు (సర్పంచ్ స్థానాలు) ఏకగ్రీవంగా అయినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం నాడు వెల్లడించింది. అలాగే 11,732 వార్డులకు కూడా ఎన్నిక ఏకగ్రీవం అయినట్టు తెలిపారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 98, అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాల్లో 6 పంచాయితీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇక 2640 పంచాయతీల్లో ఫిబ్రవరి 17 న పోలింగ్ నిర్వహించనున్నారు.

మూడో విడతలో జిల్లాలవారీగా పంచాయతీల ఏకగ్రీవాల వివరాలు:

  1. కృష్ణా – 29
  2. గుంటూరు – 98
  3. ప్రకాశం – 62
  4. నెల్లూరు – 75
  5. తూర్పుగోదావరి – 14
  6. పశ్చిమగోదావరి – 14
  7. వైఎస్ఆర్ కడప – 59
  8. అనంతపురం – 23
  9. చిత్తూరు – 91
  10. కర్నూల్ – 26
  11. శ్రీకాకుళం – 45
  12. విశాఖపట్నం – 6
  13. విజయనగరం – 37

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 13 =