మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆంధప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 3221 పంచాయతీలకు ఫిబ్రవరి 17న ఎన్నికలు జరిగేలా నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు ఫిబ్రవరి 12 తేదీ మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. దీంతో పంచాయతీల ఏకగ్రీవాలపై స్పష్టత వచ్చింది. మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 579 పంచాయతీలు (సర్పంచ్ స్థానాలు) ఏకగ్రీవంగా అయినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం నాడు వెల్లడించింది. అలాగే 11,732 వార్డులకు కూడా ఎన్నిక ఏకగ్రీవం అయినట్టు తెలిపారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 98, అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాల్లో 6 పంచాయితీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇక 2640 పంచాయతీల్లో ఫిబ్రవరి 17 న పోలింగ్ నిర్వహించనున్నారు.
మూడో విడతలో జిల్లాలవారీగా పంచాయతీల ఏకగ్రీవాల వివరాలు:
- కృష్ణా – 29
- గుంటూరు – 98
- ప్రకాశం – 62
- నెల్లూరు – 75
- తూర్పుగోదావరి – 14
- పశ్చిమగోదావరి – 14
- వైఎస్ఆర్ కడప – 59
- అనంతపురం – 23
- చిత్తూరు – 91
- కర్నూల్ – 26
- శ్రీకాకుళం – 45
- విశాఖపట్నం – 6
- విజయనగరం – 37
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ