ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. డిసెంబర్ 14, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,75,836 కు, మరణాల సంఖ్య 7059 కు చేరుకుంది. గత 24 గంటల్లో (9AM-9AM) 44,935 కరోనా పరీక్షలు నిర్వహించగా 305 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో కరోనా వలన నెల్లూరులో ఇద్దరు మరణించారు. మరోవైపు గత 24 గంటల్లో 541 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 8,64,049 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4728 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ