మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం.. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు

CBI Issues Notices to Kadapa MP Avinash Reddy in Ex-Minister YS Vivekananda Reddy Assassination Case,CBI Issues Notices,Kadapa MP Avinash Reddy,Ex-Minister YS Vivekananda Reddy,YS Vivekananda Reddy Assassination Case,Mango News,Mango News Telugu,Ys Avinash Reddy Father,Shri Y.S. Avinash Reddy,Y S Avinash Reddy Myneta,Y.S. Avinash Reddy Brothers,Y.S. Avinash Reddy Father-In-Law,Y.S. Avinash Reddy Parents,Y.S. Avinash Reddy Wikipedia,Ys Avinash Reddy,Ys Avinash Reddy Grandfather,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకానంద రెడ్డి బంధువు, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డికి సోమవారం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నోటీసులు జారీ చేసింది. హత్య కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు తొలుత అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి ఇంటికి వెళ్లారు. అనంతరం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఎదుట ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయాన్ని సీబీఐ అధికారులు సందర్శించారు. సీబీఐ వర్గాల సమాచారం ప్రకారం, అధికారులు మొదట మధ్యాహ్నం 2 గంటలకు పులివెందులలోని భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందితో ఈ ఇల్లు అవినాష్ రెడ్డికి చెందినదేనా? ఇంట్లో ఎంత మంది నివసిస్తున్నారు? వంటి విషయాలు ఆరా తీశారు.

ఈ క్రమంలో ఎంపీ అవినాష్‌ రెడ్డి పీఏ రాఘవ రెడ్డి పార్టీ కార్యాలయంలో ఉన్నారని తెలుసుకున్న సీబీఐ అధికారులు పార్టీ కార్యాలయానికి వెళ్లి విచారించిన అనంతరం కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. ఇక అప్రూవర్‌గా మారిన వివేకానంద డ్రైవర్‌ దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా సీబీఐ అవినాష్‌ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే సీబీఐ అధికారులు విచారణకు వచ్చిన సందర్భంలో ఎంపీ అవినాష్‌ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ నోటీసులపై స్పందించిన అవినాష్‌ రెడ్డి.. ఈరోజు విచారణకు తాను హాజరు కాలేనని, కొన్ని అధికారిక కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉన్నందున సాధ్యపడదని లేఖ ద్వారా తెలియజేశారు. వీటిని ముందుగా నిర్ణయించుకున్నందున వెళ్లక తప్పదని, ఈ కార్యక్రమాలు వరుసగా దాదాపు నాలుగు రోజుల పాటు ఉన్నాయని, కావున సీబీఐ ముందు హాజరు కావడానికి ఐదు రోజుల సమయం కావాలని కోరారు.

2019 మార్చి 15న వివేకానంద రెడ్డిని ఆయన నివాసంలో దారుణంగా హత్య చేసిన కేసును సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ సీబీఐకి బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తులో భాగంగా సీబీఐ.. వివేకానంద రెడ్డి హత్యకేసుతో సంబంధాలపై మంగళవారం ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరుకావాలని ఎంపీ అవినాష్‌ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఇక గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి ఈ కేసును ఆంధ్రప్రదేశ్ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో విచారణ జరిపి చార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు, ఆ తర్వాత కేసును హైదరాబాద్ జోనల్ సీబీఐకి బదిలీ చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =