తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ జనవరి 27వ తేదీ నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల, హెడ్ మాస్టర్స్ బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ యొక్క కౌన్సిలింగ్ షెడ్యూల్-2023 ను సోమవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విడుదల చేశారు. జనవరి 27 నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా, జనవరి 28-30వ వరకు మూడు రోజుల పాటుగా ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ మొత్తం 37 రోజుల పాటుగా కొనసాగి మార్చి 4 నాటికి ముగియనుంది. ఇక మార్చి 5 నుంచి 19 వరకు అప్పీళ్లకు అవకాశం కల్పించగా, ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు అందిన 15 రోజుల్లో ఈ అప్పీళ్లను పరిష్కరించనున్నట్టు షెడ్యూల్ లో పేర్కొన్నారు.
ఈ ప్రక్రియ ద్వారా రాష్ట్రంలో 9 వేలకుపైగా ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ లభించనున్నాయి. ముందుగా హెడ్ మాస్టర్స్ కు బదిలీలు ఇచ్చిన తరువాత, ఖాళీల స్థానాల్లో స్కూల్ అసిస్టెంట్ల ప్రమోషన్స్ చేపట్టనున్నారు. అనంతరం స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు చేసి, ఏర్పడే ఖాళీలలో అర్హులైన ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్స్ చేపట్టనున్నారు. అలాగే ఎస్జీటీల బదిలీలు జరుగుతాయి. ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా, ఎలాంటి అపోహలకు తావు లేకుండా జరగాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE