ప్రకాశం జిల్లాలో చంద్రబాబు ఓదార్పుయాత్ర

Chandrababu Tour In Prakasam District,Mango News,Chandrababu Naidu to visit Prakasam district today,Chandrababu Naidu to tour Prakasam district,Chandrababu Naidu To Visit Prakasam District Today,Chandrababu Naidu has started for tour of Prakasam District,Chandrababu to visit Prakasam district

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఈ రోజు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. చీరాల నియోజకవర్గంలోని రుద్రమాంబపురం గ్రామంలో టిడిపి కార్యకర్త బి.పద్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు,7.5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఇటీవలే వైసీపీ నాయకుల దాడి తరువాత బి. పద్మ ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ ఊపిరి ఉన్నంత వరకు కార్యకర్తల కోసం పోరాటం చేస్తానని చంద్రబాబు చెప్పారు, రాష్ట్రము లో ఆరుచోట్ల టిడిపి కార్యకర్తల పై దాడి చేసి చంపారని మరియు 95 చోట్ల టిడిపి కార్యకర్తల పై వివిధ రకాలుగా దాడి చేసారని, పోలీసులు మౌనంగా ఉంటే రాష్ట్రములో పరిస్థితులు మారిపోతాయని హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్ లో టిడిపి కార్యకర్తల పై జరుగుతున్న అనాగరికమైన, దుర్మార్గమైన చర్యలను వెంటనే ఆపాలని డిమాండ్ చేసారు. చంద్రబాబు ప్రకాశం జిల్లా పర్యటన సంధర్బంగా కార్యకర్తలు మరియు టిడిపి నాయకులు ముందుగానే రుద్రమాంబపురం చేరుకొని, చంద్రబాబు నాయుడు కి ఘన స్వాగతం పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − seventeen =