ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధాన్యం సేకరణ సమయంలో రవాణా ఛార్జీలు సహా గన్నీ బ్యాగుల ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన ధాన్యం సేకరణ మరియు ఖరీఫ్ పంటలపై కీలక సమీక్ష నిర్వహించిన సందర్భంగా పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు సహా పలువురు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వారికి పలు కీలక సూచనలు చేశారు.
ఖరీఫ్ ధాన్యం సేకరణపై సమీక్షలో సీఎం జగన్ చేసిన కొన్ని కీలక సూచనలు..
- రాష్ట్రంలో ఎక్కడా రైతులు ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు పంటలను విక్రయించే పరిస్థితి రాకూడదు.
- రైతులకు గరిష్ట ప్రయోజనాలను అందించేలా ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్రను తొలగిస్తున్నాం.
- ఈ-క్రాపింగ్ డేటాను ఉపయోగించి ధాన్యం సేకరణ మరింత పటిష్టంగా కొనసాగాలి.
- పౌరసరఫరాల శాఖను వ్యవసాయ శాఖతో అనుసంధానం చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలి.
- ఖరీఫ్ సీజన్ తో పాటు వచ్చే రబీ సీజన్కు ఇప్పటినుంచే సిద్ధంగా ఉండాలి.
- రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు తదితర అన్నింటిని అందించేందుకు అధికారులు సిద్ధం కావాలి.
- ప్రతి ఆర్బీకేలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి. వచ్చే రెండేళ్లలో అన్ని ఆర్బీకేలలో డ్రోన్లను అమర్చాలి.
- అలాగే ప్రతి ఆర్బీకేలో భూసార పరీక్షల పరికరాలను ఉంచాలి.
- వచ్చే మార్చిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.
- రవాణా లేబర్ ఖర్చుల రీయింబర్స్మెంట్ చెల్లింపులు పారదర్శకంగా జరగాలి.
- అలాగే రైతులకు చేసే చెల్లింపులన్నీ నేరుగా వారి ఖాతాల్లోకే వెళ్ళాలి.
- ఇక ధాన్యం సేకరణ కోసం తయారు చేసిన ప్రత్యేక యాప్ లోని సాంకేతిక సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి.
- ధాన్యం సేకరణ, కొనుగోళ్ల సమాచారాన్ని రైతుల ఫోన్లకు సందేశాలు, వీడియోల రూపంలో పంపించాలి.
- అలాగే రైతులకు మిల్లెట్స్ వంటి ప్రత్యామ్నాయ పంటలు పండించడంపై అవగాహన కల్పించడంతో పాటు అన్ని విధాలా సహకారం అందించాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE