ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. కాగా ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నందున పార్లమెంటులోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు, ప్రధాన సమస్యలపై ప్రధానితో చర్చించినట్లు సమాచారం. మూడు రాజధానుల అంశం, త్వరలోనే విశాఖ నుండి పాలన కొనసాగిస్తామని తాజాగా అసెంబ్లీలో ప్రకటన చేసిన నేపథ్యంలో దీనిపై ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది. ఇక ప్రధానితో భేటీ అనంతరం సీఎం జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా మరికొందరు ఇతర కేంద్ర మంత్రులను కలవనున్నట్లు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE