ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం కర్నూల్ జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలోని ఓర్వకల్లు మండలం గుమ్మటం తండా పరిధిలో ఏర్పాటు చేస్తున్న గ్రీన్కో ఎనర్జీస్ లిమిటెడ్ యొక్క ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రిన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ముందుగా ఈ ప్రాజెక్ట్ త్రీడీ మోడల్ నమూనాను సీఎం వీక్షించారు, అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఓ పైలాన్ను కూడా సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు.
రూ.15 వేల కోట్ల పెట్టుబడితో 5,410 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా గ్రీన్కో ఎనర్జీస్ లిమిటెడ్ సంస్థ ఈ ప్రాజెక్టును నిర్మిస్తుంది. ఒకే యూనిట్ నుంచి సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ను ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకతగా నిలవనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 3000 మెగావాట్ల సోలార్ విద్యుత్ , 550 మెగావాట్ల విండ్ విద్యుత్, 1860 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్/హైడల్ విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వచ్చే 5 సంవత్సరాల్లో పూర్తి కానుండగా, దాదాపు 23 వేల మందికిపైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల లభించనున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF