రేపు కడప జిల్లాలో పర్యటించనున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు

TDP Chief Chandrababu To Participates in a Protest Against YCP Govt at Kadapa District Tomorrow, Chandrababu To Participates in a Protest Against YCP Govt at Kadapa District Tomorrow, Protest Against YCP Govt at Kadapa District Tomorrow, TDP Chief Chandrababu Kadapa District Tour, Protest Against YCP Govt at Kadapa, Protest Against YCP Govt, TDP Chief Nara Chandrababu Kadapa District Tour, Nara Chandrababu Kadapa District Tour, Nara Chandrababu Naidu Kadapa District Tour, Chandrababu Naidu will tour Kadapa district, TDP president Nara Chandrababu Naidu, TDP Chief Nara Chandrababu Naidu, Nara Chandrababu Naidu, Chandrababu Naidu Kadapa Tour News, Chandrababu Naidu Kadapa Tour Latest News, Chandrababu Naidu Kadapa Tour Latest Updates, Chandrababu Naidu Kadapa Tour Live Updates, Mango News, Mango News Telugu,

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహా రెడ్డి చంద్రబాబు రాకపై జిల్లా పార్టీ శ్రేణులకు ప్రకటన ఇచ్చారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా చంద్రబాబు బుధవారం సాయంత్రం కమలాపురం నగర పంచాయతీ ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో పాల్గొననున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలపై అధిక చార్జీలను మోపుతోందంటూ, రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో ‘బాదుడే బాదుడు’ పేరుతో గత కొన్ని రోజులుగా ఒక నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే చంద్రబాబు నాయుడు రేపు కడపలోని కమలాపురంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారని, అందుకే పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నరసింహా రెడ్డి పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో.. ఆయన టీడీపీ కార్యాలయంలో కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు లింగారెడ్డి, రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డితో కలిసి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. పర్యటనలో మొదటగా చంద్రబాబు ఉమ్మడి కడప జిల్లా నియోజకవర్గాల సమావేశంలో పాల్గొననున్నారని, అనంతరం కమలాపురానికి చేరుకొని అక్కడ సాయంత్రం నాలుగు గంటలకు బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఇక చివరిగా స్థానిక చావిడి వద్ద ఏర్పాటు చేయస్నున్న బహిరంగ సభలో ప్రజనుద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. మే చివరి వారంలో ఒంగోలులో జరుగనున్న ‘మహానాడు’ కార్యక్రమం వరకు వివిధ జిల్లాలలో పర్యటించనున్నారు చంద్రబాబు. తద్వారా పార్టీ శ్రేణులలో, నాయకులలో ఉత్సాహాన్ని నింపాలని ఆయన భావిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =