ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్గా నియమించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు వెలువరించింది. కాగా కొమ్మినేని రెండేళ్లపాటు ఈ పదవిలో ఉండనున్నారు. ఆయనను కేబినెట్ హోదాతో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇక ఇప్పటివరకూ ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్గా మరో సీనియర్ జర్నలిస్ట్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఉన్నారు. ఆయన పదవీకాలం ముగియడంతో ఆ పదవికి తాజాగా కొమ్మినేని శ్రీనివాసరావును జగన్ సర్కార్ నియమించింది. కాగా కొమ్మినేనికి వివిధ మీడియా సంస్థల తరపున జర్నలిస్టుగా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉంది. ప్రస్తుతం అయన సాక్షి ఛానల్ లో పనిచేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE