ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 31,260 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 1398 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. ఏప్రిల్ 3, శనివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,05,946 కు చేరుకుంది. ఇక కరోనా వలన గుంటూరులో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, కర్నూల్, ప్రకాశం, విశాఖపట్నంలో జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 7234 కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 787 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 8,89,295 కు చేరింది. అలాగే ప్రస్తుతం 9417 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 1,51,77,364 కరోనా పరీక్షలను నిర్వహించారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(1398):
- తూర్పుగోదావరి – 28
- కర్నూల్ – 96
- కృష్ణా – 178
- కడప – 75
- గుంటూరు – 273
- చిత్తూరు – 190
- అనంతపూర్ – 36
- నెల్లూరు – 163
- ప్రకాశం – 48
- శ్రీకాకుళం – 51
- విశాఖపట్నం – 198
- విజయనగరం – 47
- పశ్చిమగోదావరి – 15
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ