ప్రముఖ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వివాదంలో చిక్కుకున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫ్లామ్ ఆహాలో ఆయన ‘అన్స్టాపబుల్’ అనే కార్యక్రమానికి హోస్టింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. బాగా పాపులర్ అయిన ఈ కార్యక్రమానికి పలువురు సెలెబ్రిటీలు హాజరవుతుంటారు. తాజాగా ఈ అన్స్టాపబుల్ ప్రోగ్రాంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గతంలో ఒకసారి తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి వివరిస్తూ బాలకృష్ణ నర్సుపై చేసిన కొన్ని కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ఆ నర్సు చాలా అందంగా ఉందంటూ.. ఆయన శైలిలో వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, నర్సులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని నిమ్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సులు డిమాండ్ చేశారు. ఒకవేళ బాలకృష్ణ క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలుంటాయని, అన్స్టాపబుల్ షోను బహిష్కరిస్తామని కూడా నర్సులు హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో నర్సుపై తాను చేసిన వ్యాఖ్యలపై నందమూరి బాలకృష్ణ సోమవారం వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఆయన నర్సులను ఉద్దేశిస్తూ.. ‘అందరికీ నమస్కారం.. నర్సులను కించపరిచానంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నా మాటలను కావాలనే వక్రీకరించారు. రోగులకు సేవలందించే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను. రాత్రింబవళ్లు రోగులకు సేవలు చేసి సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కరోనా వేళ ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ఎంతోమంది నర్సులు పగలనక, రాత్రనక నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు ఎంతగానో సేవలందించారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకుని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా’ అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE