భారత వాతావరణ శాఖ ఉభయ తెలుగు రాష్ట్రాలకు కీలక సూచన చేసింది. ఈరోజు నుంచి 30వ తేదీ వరకు రెండు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలోని రాయలసీమ ప్రాంతంలో జులై 26, 30 తేదీల్లో, కోస్తాంధ్ర ప్రాంతంలో 26, 29, 30 తేదీల్లోభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే తెలంగాణలో కూడా మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఒకవైపు ఇప్పటికే హైదరాబాద్లో ముసురు పట్టింది. సోమవారం అర్ధరాత్రి భారీ వర్షం నగరాన్ని ముంచెత్తింది.
Isolated heavy falls very likely over Gujarat Region, Marathwada, North Interior Karnataka, Chhattisgarh, Vidarbha & Madhya Pradesh on 26th; Jharkhand on 28th; Rayalaseema on 26th & 30th; Coastal Andhra Pradesh on 26th, 29th & 30th;… 4/7
— India Meteorological Department (@Indiametdept) July 26, 2022
…South Interior Karnataka during 27th-29th, Kerala & Mahe on 29th & 30th; Tamil Nadu, Puducherry & Karaikal and Telangana during 26th-30th July, 2022.
Isolated heavy to very heavy rainfall also likely over Telangana on 26th July, 2022. 5/7— India Meteorological Department (@Indiametdept) July 26, 2022
ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ మరో మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ముఖ్యంగా మంగళవారం రాత్రికి హైదరాబాద్లో అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలను అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ సూచిస్తున్నారు. ఇప్పటికే నగరవ్యాప్తంగా పలుచోట్ల వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఇళ్లు, షాపుల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. అనేకచోట్ల రోడ్లపై మోకాలిలోతు నీటిలో వాహనాలు ఉండిపోయాయి. ఈ కారణంగా జంట జలాశయాల్లోకి వరద పోటెత్తింది. ద్దేన్తో గేట్లు పైకెత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ