ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, వరద బాధితులను పరామర్శించిన విషయం తెలిసిందే. ఇక వరుసగా రెండో రోజు కూడా గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించి, బాధితులతో సీఎం వైఎస్ జగన్ నేరుగా మాట్లాడనున్నారు. రెండోరోజు (జూలై 27, బుధవారం) పర్యటనలో భాగంగా అల్లూరి సీతారామరాజు(ఏఎస్ఆర్), ఏలూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించనున్నారు. ముందుగా బుధవారం ఉదయం 8.30 గంటలకు రాజమహేంద్రవరం ఆర్అండ్బీ గెస్ట్హౌస్ నుంచి బయలుదేరి ఏఎస్ఆర్ జిల్లా చింతూరుకు సీఎం వైఎస్ జగన్ చేరుకోనున్నారు.
ఉదయం 9.30 గంటలకు చింతూరు మండలంలోని కుయుగూరు, చట్టి గ్రామాల్లో వరద బాధితులతో సీఎం సమావేశమవుతారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కన్నయగుట్ట గ్రామం చేరుకుని అక్కడ ఏర్పాటుచేసిన వరద బాధిత గ్రామాలకు సంబంధించిన ఫోటో గ్యాలరీని పరిశీలించనున్నారు. అనంతరం తిరుమలాపురం, నార్లవరం గ్రామాలకు చెందిన వరద బాధితులతో సమావేశమవుతారు. ఇక మధ్యాహ్నం 1 గంటకు అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లికి తిరుగుప్రయాణం కానున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY