రేపు అనంతపురం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన, కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేత

Janasena Chief Pawan Kalyan to Tour in Anantapur District Tomorrow, Janasena Chief Pawan Kalyan to Tour in Anantapur, Janasena Chief Pawan Kalyan Tour, Pawan Kalyan Tour in Anantapur, Pawan Kalyan to Visit Anantapur District, Jana Sena chief Pawan Kalyan Raithu Yatra from anantapur district, Pawan Kalyan Raithu Yatra, Janasena party chief Pawan Kalyan will tour Anantapur district, Anantapur District, Janasena Chief Pawan Kalyan, Janasena Chief, Pawan Kalyan, Pawan Kalyan Raithu Yatra News, Pawan Kalyan Raithu Yatra Latest News, Pawan Kalyan Raithu Yatra Latest Updates, Raithu Yatra, Janasena Chief Pawan Kalyan Raithu Yatra in Anantapur district, Mango News, Mango News Telugu,

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు (ఏప్రిల్ 12, మంగళవారం) అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆ జిల్లాలోప్రాణాలు తీసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. “ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు ఆర్ధిక సాయం అందించి వారిలో ధైర్యం నింపడానికి తలపెట్టిన కౌలు రైతుల భరోసా యాత్రను అనంతపురం జిల్లాలో పవన్ కళ్యాణ్ మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం కోసం 12వ తేదీ ఉదయం 9 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. అక్కడి నుంచి మండల కేంద్రమైన కొత్తచెరువు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేస్తారు. 10:30 గంటలకు కొత్త చెరువు నుంచి బయలుదిరి ధర్మవరంలో మరో బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం అందిస్తారు” అని తెలిపారు.

అనంతరం 11:20 గంటలకు ధర్మవరం నుంచి బయలుదేరి ధర్మవరం రూరల్ లోని గొట్లూరు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న మరో రైతు కుటుంబాన్ని పరామర్శించి వారిలో ధైర్యాన్ని నింపి ఆర్థిక సాయం చేస్తారు. అక్కడి నుంచి 12:10 గంటలకు బయలుదేరి అనంతపురం రూరల్ మండలంలోని పూలకుంట గ్రామానికి చేరుకుంటారు. ఆ గ్రామంలో సుమారుగా 20 రోజుల క్రిందట ఆత్మహత్యకు పాల్పడిన యువ రైతు కుటుంబాన్ని ఓదార్చి వారికి ఆర్ధిక సహాయం అందచేస్తారు. చివరిగా 3 గంటలకు అనంతపురం రూరల్ మండలంలోని మన్నీల గ్రామం చేరుకుంటారు. ఆ గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు కౌలు రైతుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందచేసి అక్కడ నిర్వహించే గ్రామసభ (రచ్చబండ) కార్యక్రమంలో పాల్గొంటారు. జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన మరికొందరు కౌలు రైతుల కుటుంబాలకు ఈ సభలో ఆర్ధిక సహాయం అందచేసి వారి కుటుంబ పరిస్థితులను తెలుసుకుంటారు. గ్రామ సభ అనంతరం పవన్ కళ్యాణ్ తిరిగి హైదరాబాద్ కు బయలుదేరి వెళతారు” అని ప్రకటనలో పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =