ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నవంబర్ 27, శుక్రవారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన అనంతరం కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మీడియాకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు:
- నివర్ తుఫాన్ తో 30 వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 1300 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. తుఫాన్ బాధిత రైతులకు డిసెంబర్ 30 కల్లా పంట నష్టపరిహారాన్ని అందించాలని నిర్ణయం.
- రూ.9,027 కోట్లతో వైఎస్ఆర్ శాశ్వత భూహక్కు, యాజమాన్య సమగ్ర సర్వేకు కేబినెట్ ఆమోదం. డిసెంబర్ 21 నుండి ప్రారంభం.
- డిసెంబర్ 25న 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆమోదం.
- మొత్తం 28లక్షల 30వేల ఇళ్ల నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం. తొలిదశలో 16 లక్షల ఇళ్ల నిర్మాణం, మూడుదశల్లో జూన్ 2022 నాటికీ ఇళ్లనిర్మాణం పూర్తి. ఇళ్ల నిర్మాణానికి ఇసుకను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం.
- డిసెంబర్ 2 న ఏపీ అమూల్ ప్రాజెక్టు ప్రారంభం.
- డిసెంబర్ 8న వైఎస్ఆర్ చేయూత లబ్దిదారులకు 2.49లక్షల యూనిట్ల గొర్రెలు, మేకలు పంపిణీ.
- డిసెంబర్ 15 న వైఎస్ఆర్ పంటభీమా చెల్లింపులకు నిర్ణయం.
- కరోనా లాక్ డౌన్ సమయంలో ఉద్యోగులకు కోత విధించిన వేతనాలు, పింఛనర్లకు సంబంధించి విధించిన పింఛన్స్ కోతను డిసెంబర్, జనవరి నెలలో చెల్లించాలని నిర్ణయం. వేతనాలకు రూ.2324 కోట్లు, పింఛన్స్ కు రూ.482 కోట్లు చెల్లింపు.
- ఉద్యోగులు, పింఛన్దారుల డీఏ బకాయిల చెల్లింపుతో పాటుగా, 3.144 శాతం డీఏ పెంపుకు ఆమోదం.
- అంగన్ వాడీ, హోమ్ గార్డ్స్ వేతన బకాయిలు చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం.
- తుఫాన్ ప్రభావంతో 10 వేల మందికి పునరావాస శిబిరాలకు తరలింపు. వారికీ తక్షణ సాయంగా రూ.500 ఇవ్వాలని నిర్ణయం.
- అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు ముసాయిదా బిల్లులకు ఆమోదం.
- ఏపీ ఫిషరీస్ యూనివర్శిటీ బిల్లుకు ఆమోదం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ