మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఇటీవల కొన్ని రోజుల పాటుగా కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య తగ్గినప్పటికీ, మళ్ళీ పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. నవంబర్ 27, శుక్రవారం నాడు కూడా 6185 పాజిటివ్ కేసులు, 85 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,08,550 కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య 46,898 కు పెరిగింది. మరోవైపు ఇప్పటికే 16,72,627 మంది సంపూర్ణ ఆరోగ్యంతో రికవరీ అవ్వగా, ప్రస్తుతం 87,969 మంది చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (నవంబర్ 27, శుక్రవారం నాటికీ):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు: 1,06,35,600
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 18,08,550
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 16,72,627
- యాక్టీవ్ కేసులు – 87,969
- నవంబర్ 27 న నమోదైన కేసులు – 6185
- నవంబర్ 27 న డిశ్చార్జ్ అయినవారు – 4089
- నవంబర్ 27 న నమోదైన మరణాల సంఖ్య – 85
- మొత్తం మరణాల సంఖ్య – 46,898
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ