రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మే 5, బుధవారం నుంచి పాక్షిక కర్ఫ్యూ విధించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మే 5 నుంచి రెండువారాలు పాటుగా ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి పాక్షిక కర్ఫ్యూ (సెక్షన్ 144) అమలులో ఉండనుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే దుకాణాలకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఆ తర్వాత కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇస్తామని తెలిపారు.
రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా సీఎం వైఎస్ జగన్ పాక్షిక కర్ఫ్యూ సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. ప్రజలకు, వ్యాపారస్తులకు, ఉద్యోగులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా ఆలోచన చేస్తున్నామని, అందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటిస్తామని చెప్పారు. ఉదయం 6 నుంచి 12 గంటల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజాజీవనం యథావిథిగా ఉంటుందని చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ